ఎవరు ఎన్ని అనుకున్నా కూడా వాల్మీకి రామాయణంలో మనం ఒక ఘట్టాన్ని మర్చిపోకూడదు . కైకకు రాములవారు ఇచ్చిన ప్రామిస్ కైక అడిగిన వరాలు సింపుల్ ఆ ఘట్టం ఒకటి చదివితే రాముడు తిన్నాడా లేదా అనేది అందరికి తెలిసిపోతుంది .... ఒకవేళ రాములవారు మాంసం తిన్నాడు అని అంటే మాట తప్పడు మాట తప్పడు మడిమతిప్పడు అనే రాముల వారి యొక్క ఉపమానానికి కళంకం తెచ్చిన వాళ్ళం అవుతాం... మీరు చెబుతున్నారు తిన్నాడు అని ఆ ఫోటోలు ప్రింట్ తీసి చూపించండి ఏముందో తెలుస్తుంది మీకు ఆ శ్లోకాలు అర్థాలు చేసుకోండి
1) శ్రీ రాఘవుడు తన తండ్రి అయిన దశరథునితో చెప్పిన మాటలు....
ఫలాని మూలాని చ భక్షయన్ వనే
గిరీంశ్చ పశ్యన్ సరితః సరాంసి చ
వనం ప్రవిశ్యెవ విచిత్రపాదపం
సుఖీ భవిష్యామి తవాస్తు నిర్వృతిః
చిత్ర విచిత్రములైన వృక్షములతో విలసిల్లెడి వనములయందు ప్రవేశించి, ఫలమూలములను భుజించుచు, అచటి పర్వతములను, నదీ ప్రవాహములను, సరోవరతీరములను గాంచుచు అచట హాయిగా ఉందును. కనుక నీవును ఇచట మనస్తాపమునువీడి శాంతచిత్తుడవై ఉండుము.”
2) శ్రీరామచంద్రుడు గుహునితో చెప్పిన మాటలు
భక్ష్యం భోజ్యం చ పేయం చ లేహ్యం చేదముపస్థితమ్ ।
శయనాని చ ముఖ్యాని వాజినాం ఖాదనం చ తే |
కుశచీరాజినధరం ఫలమూలాశినం చ మామ్ । విద్ధి ప్రణిహితం ధర్మే తాపసం వనగోచరమ్ ।
అనంతరము ఆ గుహుడు వెంటనే వివిధములైన రుచికరములగు అన్నపానీయములను తెప్పించెను, ఆ స్వామికి అర్ఘ్యపాద్యాది సత్కారములను నెఱపెను, పిదప ఆయనతో ఇట్లనెను. (37)
37
“ఓ మహాబాహూ! మీకు స్వాగతము, ఈ రాజ్యమంతయును మీదే. మీరు మాకు ప్రభువులు, మేము పరిచారకులము. కావున సాదరముగా ఈ రాజ్యమును పరిపాలింపుడు. భక్ష్యములు (అన్నము మొదలగుని) భోజ్యములు, (పాయసాదులు) పానకములు మొదలగునవియును, లేహ్యములును ఇచట సిద్ధముగానున్నవి. అందఱును ఆరగింపుడు. చక్కని శయ్యలు ఏర్పాటు చేయబడినవి. గుఱ్ఱములకు గడ్డి మొదలగు ఆహారపదార్థములు సిద్ధమొనర్ప బడినవి.” (38-39)
“ఓ మిత్రమా! వీటిని నేను ప్రతిగ్రహింపజాలను. ఏలనన ప్రస్తుతము నేను పితృవాక్యపరిపాలన ధర్మమునకు బద్ధుడనై వనములయందు తాపసిగానున్నాను. కనుక నారచీరలు, మృగచర్మమును ధరించియుంటిని. ఫలమూలాదులే నాకు ఆహారములు, దీనిని గమనింపుము. (41-44)
అయోధ్యకాండ ఏకాదశి సర్గ 27వ శ్లోకం
దశరథునితో కైక అడిగిన వరాలు
అయోధ్యకాండ 34వ సర్గ 59 వ శ్లోకం
నవ పంచ చ వర్షాణి దండకారణ్యమాశ్రితః । చీరాజినజటాధారీ రామో భవతు తాపసః। 22
రామలక్ష్మణులకు ఆకలి దప్పులు లేకుండా విశ్వామిత్రుల వారు బలా అతిబల అనే విద్యలను అనుగ్రహించారు ..... మరి అటువంటప్పుడు మన పేరు మోసిన ప్రవచరకారులు చాగంటి గరికపాటి మొదలైన వారు రామలక్ష్మణులు ఆకలితో ఉన్నప్పుడు అడవిలోకి వెళ్లి జింకలు దుప్పులు అడవి పందులను చంపి తీసుకుని వచ్చి (పచనం )అంటే కాల్చి తిన్నారు అని ఎలా చెప్తారు ... తమకు తాము స్వయం ప్రకటిత మేధావులుగా ప్రజలకు ప్రజలకు తెలియ చెప్పుకోవటానికి కొన్ని సంస్కృత పదాలు అలా పారవేస్తే అబ్బో ఎంత గొప్పగా చెప్పారు పండితుల వారు అని అనుకోవాలని ...... నోటికి వచ్చినదల్లా వాగుతూ ఉంటారు ...
శ్రీరాముడంటే పడని వారు ఇలాంటి అపవ్యాఖ్యానాలు చేస్తూనే వుంటారు .... మాంసం తిన్నాడనీ ఒకరు మద్యం తాగారు అని ఒకరు.... హత్యా పాతకం చుట్టుకున్న పాపాత్ముడు అని ఒకరు మాకు తెలిసిన శ్రీ రాముడు షోడశకళానిధి;గుణనిధి; దేవాదిదేవుడు....సకల శాస్త్రాలు ప్రామాణిక గ్రంధాలు తెలిపింది కూడా అదే !!!
మాంసం అనే పదానికి అర్థం ఏమిటి ???
మన్యతే బలకరతి ఇతి మాంసం ..... కండ పట్టి వున్న దుంపలకు కూడా మాంసము అని పేరు ఆయుర్వేదములో కూడా కొన్ని దుంపలకు మొక్కలకు కూడా మాంసము అనే పేర్లు వున్నాయి ..... ఇక్కడ శ్రీ రాముడు మాంసం తిన్నాడు అని రామాయణం లో వుంటే కంద మూలాలు తిన్నాడని అర్థం ..... అంతే కానీ దారిన పోయే జంతువును పట్టుకొని తోలు తీసుకొని తిన్నాడు అని కాదు ఆ లెక్కన దుంపలకు కూడా తోలు అనేది వుంటుంది అరటి పండు కూడా తొక్క తీయకుండా తినలేము తోలు అనే పదం వుంది మాంసం అనే పదం వుంది అని అపవ్యాఖ్యాణాలు చేయకూడదు ..... పోనియండి ఈ పండితులు పాండిత్యం ఎంత వున్నా వ్యాస భగవానుడి కంటే గొప్పవారా??? భీష్మ పితామహుల కంటే గొప్పవారా???
వ్యాస భగవానుడు రచించిన మహాభారతం లో అనుశాసనిక పర్వము లో 116వ అధ్యాయం లో భీష్మ పితామహుడు ధర్మరాజుకి మాంసం భక్షించనీ రాజుల గురించి చెప్తున్నారు శ్లోకం సంఖ్య మీకు శ్లోకం పక్కన ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి .....
63:- యే వర్జయన్తి మాంసాని మాసశః పక్షశొ ఽపి వా
తేషాం హింసా నివృత్తానాం బరహ్మలొకొ విధీయతే
64 :- మాంసం తు కౌముథం పక్షం వర్జితం పార్ద రాజభిః
సర్వభూతాత్మభూతైర తైర విజ్ఞాతార్దపరావరైః
65 :- నాభాగేనామ్బరీషేణ గయేన చ మహాత్మనా
ఆయుషా చానరణ్యేన థిలీప రఘుపూరుభిః
66 :- కార్తవీర్యానిరుథ్ధాభ్యాం నహుషేణ యయాతినా
నృగేణ విష్వగశ్వేన తదైవ శశబిన్థునా
యువనాశ్వేన చ తదా శిబినౌశీనరేణ చ
67:- శయేనచిత్రేణ రాజేన్థ్ర సొమకేన వృకేణ చ
రైవతేన రన్తి థేవేన వసునా సృఞ్జయేన చ
68:- థుఃషన్తేన కరూషేణ #రామాలర్క నలైస తదా
విరూపాశ్వేన నిమినా జనకేన చ ధీమతా
69 :- సిలేన పృదునా చైవ వీరసేనేన చైవ హ
#ఇక్ష్వాకుణాశమ్భునా చ శవేతేన సగరేణ చ
70 :- ఏతైశ చాన్యైశ చ రాజేన్థ్ర పురా మాంసం న భక్షితమ
శారథం కౌముథం మాసం తతస తే సవర్గమ ఆప్నువన
ముప్పయి మంది రాజులు మాంసం తినలేదు అని చెప్తూ అందులో శ్రీరాముని ప్రస్తావన కూడా తెచ్చారు భీష్మాచార్యులు .....
భూమ్యాకాశాలు తల్లకిందులు అయినా అబద్దం చెప్పని భీష్మ పితామహుడు.....
ధర్మానికి నిలువెత్తు నిదర్శనమైన ధర్మరాజుకి బోధించిన పాఠం ! గ్రంధస్తం చేసింది అష్టాదశ పురాణములను లోకానికి అందజేసిన మహనీయుడు... ఇది పరమ ప్రామాణికం .... ఈ వ్యాఖాతలు పండితులు అందరూ కూడా వాల్మీకి మహర్షి వ్యాస భగవానుడి తర్వాతే అన్న సత్యాన్ని గ్రహించండి 🙏
రాముడు మాంసం తినడు ఇది సత్యము అదే హనుమంతుడు శ్రీరాముని గురించి సీతమ్మకు తెలిపాడు .... భీష్ముడు తన మనవడైన ధర్మరాజుకి బోధించాడు
ప్రమాణాలను నమ్మండి ప్రవచన/ పరవచన కారులను కాదు !!!
Reference by Sri Agraharam Raghava.
#LordRama #BhagawanRama #SriRamaChandraPrabhu #NonVeg #Vegetarian #SitaMatha #
No comments:
Post a Comment