ఖడ్గం..
శ్వేత వరాహ మూర్తి
సూర్య.. చంద్రులు..
వారు వేయించిన శాసనాల మీద కట్టించిన దేవాలయాల దగ్గర ప్రతి చోట రాజముద్ర కచ్చితంగా చెక్కబడి ఉంటుంది..
( శ్వేత వరాహ స్వామి ఆశీస్సులతో..
సూర్యచంద్రులు ఉన్నంతకాలం మా కత్తికి ఎదురు లేదు.. అని కావొచ్చు )
పైగా ఈ గుర్తు.. మరకల పాలిట యమ పాశం..
శృంగేరి పీఠాధిపతులు జగద్గురువు శ్రీ విద్యారణ్య స్వామి ఆశీస్సులతో మొదలుపెట్టిన రాజ్యం అంచలంచెలుగా ఎదుగుతూ..
మహామంత్రి తిమ్మరసు.. చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల కాలంలో అత్యున్నత శిఖరాలు చేరుకుంది.. స్వర్ణయుగం అనుభవించింది దక్షిణ భారతదేశం..
వీరి నిష్క్రమణ తర్వాత మెల్లమెల్లగా ఆ ప్రాభవం తగ్గుతూ పోయింది..


No comments:
Post a Comment